బడి బయట బాలలపై సర్వే

fastsr
0 Min Read

 పెడన మండలంలో బడి బయట ఉన్న బాలలను అధికారులు గుర్తిస్తున్నారు. మండలంలో 128 మంది 14 ఏళ్లలోపు బాలలు బడికి దూరంగా ఉన్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. ఇటీవల స్థానిక బంగ్లాస్కూల్లోని ఎమ్మార్సీలో నిర్వహించిన సమీక్షలో సమగ్ర శిక్ష సహాయ ఐఈడీ కో ఆర్డినేటర్ ఏడుకొండలు బడి బయట బాలల్ని వెంటనే పాఠశాలలకు తీసుకురావాలని ఎంఈవో, సచి వాలయ వెల్ఫేర్ కార్యదర్శులను ఆదేశించారు. ఈనేపథ్యంలో గత కొన్ని రోజులుగా సర్వే నిర్వహిస్తున్న సిబ్బంది బాలల్ని గుర్తించే పనిని మొదలు పెట్టారు. కొంతమంది వలసలు వెళ్లినట్లు గుర్తించామని త్వరలో లక్ష్యాన్ని సాధిస్తామని ఎంఈవో మెటిల్దారాణి చెప్పారు.

Share This Article